by సూర్య | Fri, Mar 27, 2020, 03:23 PM
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం దానిపై చేస్తున్నయుద్దానికి ప్రజలందరూ సహకరించాలని శుక్రవారం గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఎసురత్నం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాని నివారించేందకు ఎప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉందని చెప్పారు. కావున అప్పటి వరకు ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండావలసిన అవసరముందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనాను నివారించేందకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలందరు సామాజిక భాద్యతగా దూరాలను పాటిస్తే వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. కరోనాను నివారించేందకు ప్రభుత్వం ఎప్పటికప్పడు సూచనలు పాటించాలన్నారు. ప్రభుత్వం కరోనాను నివారించేందకు మిర్చి యార్డను పైతం 31 వరకు మూసివేశామని చెప్పారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాని నివారించేందకు అన్నివిధాలుగా కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజలందరి సహకారంతో కరోనాపై విజయం తద్యమని ధీమా వ్యక్తం చేశారు.
Latest News