by సూర్య | Fri, Mar 27, 2020, 01:10 PM
దేశంలో కరోనా వైరస్ ఎఫెక్ట్తో లాక్డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. రెపోరేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రజలు తీసుకున్న అన్ని రకాల రుణాలపై మూడు నెలలపాటి మారటోరియం విధించినట్లు తెలిపారు. అలాగే అన్ని రకాల రుణాలకు సంబంధించిన ఈఎంఐలు మూడు నెలలపాటు చెల్లించకపోయిన సిబిల్ స్కోరులో ఎలాంటి మార్పు ఉండదని ఆయన ప్రకటించారు. అంతే కాకుండా ఈ మూడునెలల ఈఎంఐలు రుణాల యొక్క సంపూర్ణ కాలవ్యవధిలోగా ఎప్పుడైనా తిరిగి చెల్లించవచ్చునని ఆయన తెలిపారు
Latest News