కన్నీటి ద్వారా కరోనా వైరస్ వస్తుందా ?

by సూర్య | Fri, Mar 27, 2020, 11:30 AM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించదని వైద్యులు స్పష్టం చేశారు. కానీ, తుమ్మినపుడు, దగ్గినపుడు వచ్చే నీటి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందని తేల్చారు. అయితే, మరికొంతమందికి కన్నీటిద్వారా వ్యాపిస్తుందా అనే సందేహం ఉత్పన్నమవుతోంది.ఇదే అంశంపై సింగపూర్ వైద్యులు పరిశోధనలు జరిపారు. వీరి పరిశోధనల్లో కరోనా సోకినవారి కన్నీరు మన మీద పడినా.. దాన్నుంచి వైరస్‌ వ్యాపించదని, ఆ నీటిలో వైరస్‌ ఉండదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇన్ఫెక్షన్‌ డిసీజెస్‌ పరిశోధకులు తెలిపారు.ఈ అధ్యయనంలో భాగంగా వారు కొవిడ్‌-19 బారిన పడిన 17 మంది కన్నీటి చుక్కలను వారికి నయమయ్యే దాకా రోజూ సేకరించి పరీక్షించారు. రోగుల ముక్కు, నోటి స్రావాల్లో ఉన్న వైరస్‌.. వారి అశ్రువుల్లో మాత్రం లేదని వారి పరీక్షల్లో తేలింది.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM