by సూర్య | Thu, Mar 26, 2020, 04:32 PM
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాల వర్షం కురిపించారు... దానికి సంబంధిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
> నిరుపేదలకు రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ
> ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో స్కీం
> రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు.
> 8.69 కోట్ల రైతులకు రూ. 2000 మొదటి విడత విడుదల
> ఏప్రిల్ మొదటివారంలో ఖాతాల్లోకి సొమ్ము
> 80 కోట్ల మంది పేదలకు 5 కేజీల గోధుమలు లేదా 5 కేజీల బియ్యంతో పాటు 1 కేజీ పప్పు దినుసులు
-> ఆహారధాన్యాలు వచ్చే నెల నుంచి 3 నెలల పాటు సరఫరా
> వైద్యులు, పారామెడికల్, హెల్త్ కేర్ రంగాల సిబ్బందికి రూ. 50 లక్షల విలువైన బీమా
> 20 కోట్ల జన్ధన్ మహిళా ఖాతాల్లో మూణ్ణెళ్ల పాటు రూ. 500
> 3 కోట్ల మంది వృద్ధులు, దివ్యాంగులు, పెన్షనర్ల ఖాతాల్లోకి అదనంగా రూ. 1000 మూణ్ణెళ్ల పాటు (రెండు విడతలుగా నేరుగా ఖాతాల్లోకి)
> ఉజ్వల పథకం లబ్దిదారులకు రానున్న 3 నెలల్లో 3 గ్యాస్ సిలిండర్లు
> 63 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 20 లక్షల వరకు తనఖా లేని రుణాలు, తద్వారా 7 కోట్ల కుటుంబాలకు లబ్ది
> ఈపీఎఫ్ఓ ఉద్యోగులు తమ అకౌంట్ల నుండి 75% విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు.