by సూర్య | Tue, Mar 24, 2020, 01:43 PM
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో టెన్త్ క్లాస్ పరీక్షలను ప్రస్తుతం రెండు వారాలపాటు వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు రీషెడ్యూల్ తేదీలను మార్చి 31న ప్రకటిస్తామని చెప్పారు. కాగా, తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 31నుంచి ఏప్రిల్ 17వరకు ఏపీ టెన్త్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది.
Latest News