జగన్ సర్కార్‌కు మరో షాక్

by సూర్య | Mon, Mar 23, 2020, 12:58 PM

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా జగన్ ప్రభుత్వం జారీ చేసిన మరో జీవోకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి భూముల్ని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించంది. గుంటూరు విజయవాడ , దుగ్గిరాల, పెదకాకాని ప్రాంతాలకు చెందిన 51వేలమందికి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల కోసం 1215 ఎకరాల భూమిని కేటాయించింది. దీనిపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఈ జీవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.... జీవోపై స్టే విధించింది.


విచారణ సందర్భంగా రాజధాని రైతుల తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. రాజధాని గ్రామాల్లోని పేదలకు మాత్రమే ఇక్కడి భూములు కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉన్న విషయాన్ని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పుడు ఆలోచనలో పడింది. మరోవైపు కర్నూలుకు కర్యాలయ తరలింపునపై కూడా ఇటీవలే కోర్టు అడ్డు చెప్పంది.


 


ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనల్లో భాగంగా..కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా..న్యాయ విభాగం పరిధిలోకి వచ్చే శాఖలను కర్నూలును తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జీవోల జారీ విషయంలోనూ వివాదం నెలకొని ఉంది. ఈ జీవోల పైన హైకోర్టులో దాఖలైన పిటీషన్ల పైన ప్రభుత్వ వివరణ కోరింది. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తరువాత హైకోర్టు కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM