by సూర్య | Sat, Mar 21, 2020, 08:05 PM
ఏపీలో కరోనా నివారణకు కేంద్రం రంగంలోకి దిగాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీలో కరోనా లేదని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ప్రయత్నం సీఎం జగన్ చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. కరోనాపై ఏపీ ప్రభుత్వం నిజాలు దాచి పెడుతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనాపై ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ చూస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని లోకేష్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కోనే ధైర్యం లేక వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు లోకేష్ విమర్శలు గుప్పించారు.
Latest News