by సూర్య | Sat, Mar 21, 2020, 07:54 PM
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపుగా 170 పైగా దేశాల్లో విస్తరించిన మహమ్మారి 9000 మందికి పైగా ప్రాణాల్ని బలి తీసుకుంది. భారత్ లో మొదట అంతగా ప్రభావం చూపని ఈ మహమ్మారి క్రమక్రమంగా కోరలు చాస్తోంది. కాగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 52 కేసులు నమోదయ్యాయి. దీనిని మహారాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి రాజేష్ తోపే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్ లో ఇప్పటివరకు 14,90,303 మందికి కరోనా పరీక్షలు
కరోనా పాజిటివ్ గా నమోదైన కేసులు: 283
రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం - పాజిటివ్ కేసుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ - 3
ఛత్తీస్ గఢ్- 1
ఢిల్లీ- 26
గుజరాత్- 7
హర్యానా- 17
కర్ణాటక - 15
హిమాచల్ ప్రదేశ్ 2
కేరళ - 40
మహారాష్ట్ర - 63
ఒడిషా - 2
పంజాబ్ - 13
పాండిచ్చేరి- 1
రాజస్థాన్ - 17
తమిళనాడు- 3
తెలంగాణ - 21
చండీగఢ్- 1
జమ్మూ& కాశ్మీర్- 4
లడఖ్- 13
ఉత్తరప్రదేశ్ -24
ఉత్తరాఖండ్ - 3
పశ్చిమ్ బంగా- 3
హిమాచల్ ప్రదేశ్-2
మధ్యప్రదేశ్-4
మొత్తం కేసులు(భారతీయులు, విదేశీయులు) - 283
కాగా ఈ మహమ్మారితో పోరాడి ఇప్పటివరకు 23 మంది జయించారు.
రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం డిశ్చార్జి అయినవారి సంఖ్య
ఢిల్లీ - 5
కేరళ - 3
రాజస్థాన్ - 3
తమిళనాడు- 1
తెలంగాణ - 1
ఉత్తరప్రదేశ్ - 9
కర్ణాటక-1
ఈ మహమ్మారి ఇప్పటివరకు నలుగురి ప్రాణాలను బలిగొంది.
రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం సంభవించిన మరణాలు
కర్ణాటక - 1
ఢిల్లీ - 1
మహారాష్ట్ర- 1
పంజాబ్ - 1
కరోనాను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలను ముమ్మరం చేశాయి. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి.
Latest News