by సూర్య | Sat, Mar 21, 2020, 03:24 PM
ఈనెల 27 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. కరోనా విస్తృతి నేపథ్యంలో ఈ సమావేశాలను నాలుగైదు రోజుల్లో ముగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల వ్యయాల నిమిత్తం అసెంబ్లీ అనుమతి పొందేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సమావేశాల ప్రారంభం సందర్భంగా 27న గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి 28న ధన్యవాద తీర్మానం ఉంటుంది. అదే రోజు లేదా మరుసటి రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Latest News