భోజనం చేసిన వెంటనే పండ్లు తినకూడదు ఎందుకంటే ?

by సూర్య | Sat, Mar 21, 2020, 02:22 PM

భోజనం తర్వాత వెంటనే అవి అంతగా జీర్ణం కావని.. వాటిలోని పోషకాలు సరిగ్గా జీర్ణవ్యవస్థచేత పీల్చబడవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనానికి పండ్లను తీసుకోవడానికి కనీసం 30 నిమిషాల వ్యవధి వుండాలి. లేదా భోజనానికి ఒక గంట ముందు లేదా ఎసిడిటీ, డయాబెటీస్ వంటి సమస్యలున్నవారైతే భోజనం తర్వాత రెండు గంటలకు తినాలి. ఎందుకంటే డయాబెటీస్‌తో కొన్ని జీర్ణక్రియ సమస్యలుంటాయి.  అజీర్ణం, ఎసిడిటీ వంటివి లేకుంటే పండ్లను పెరుగుతో కలుపుకుని తీసుకోవచ్చు. ఆపిల్, ఆరెంజ్, పుచ్చకాయ, దానిమ్మ వంటివి పెరుగుతో కలుపుకోవచ్చు. బెర్రీలు, డ్రై ఫ్రూట్స్ కూడా పెరుగుతో తినవచ్చు. సాధారణంగా ఇతర ఉడికించిన ఆహారాలకంటే కూడా పండ్లు త్వరగా జీర్ణం అయిపోతాయి. వీలైనంతవరకు పండ్లను ఉడికించిన ఆహారాలతో పాటు తీసుకోకూడదు. పండ్లను మూడు రోజుల కంటే అధిక రోజులు ఫ్రిజ్‌ల్లో నిల్వ వుంచకూడదు.  

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM