by సూర్య | Sat, Mar 21, 2020, 02:04 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు పెట్రోల్ బంక్లను బంద్ ఉంచనున్నారు. రేపటి దేశవ్యాప్త జనతా కర్ఫ్యూకు పెట్రోల్ బంక్లు మద్దతు తెలపనున్నాయి. రేపు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంక్లను మూసి ఉంచనున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో పెట్రోల్ బంక్ల మూసివేతపై కాసేపట్లో నిర్ణయించనున్నారు.
Latest News