by సూర్య | Sat, Mar 21, 2020, 01:19 PM
ఏపీ సర్కార్ 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ 14న జరగనుంది. అయితే ఇళ్లు కట్టించే కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలుగా పేరు ఖరారు చేశారు. దీనికి సంబంధించి ఏపీ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి జీవో శుక్రవారం జీవో జారీ చేశారు. కులాలు,మతాలతో సంబంధం లేకుండా సర్కార్ అర్హులైన పేదలందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, ఇళ్లులు నిర్మించి ఇవ్వనుంది.
Latest News