by సూర్య | Sat, Mar 21, 2020, 12:56 PM
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం ప్రజలెవరూ ఇళ్లలోనుంచి బైటకు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏపీలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనానై ప్రధాని పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఈ అర్ధరాత్రి నుంచే నిలిపివేయనున్నట్టు చెప్పారు. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు.
Latest News