by సూర్య | Sat, Mar 21, 2020, 09:59 AM
అమరావతి రాజధాని గ్రామాల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీకి మూడు రాజధానుల ప్రకటనకు నిరసనగా, అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనబాట పట్టిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనలు 95వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, 14వ మైలు తాడికొండ అడ్డరోడ్డులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు.
Latest News