by సూర్య | Fri, Mar 20, 2020, 08:36 PM
కరోనా మహమ్మారి భారత్ లో అతివేగంగా విస్తరిస్తోంది. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వైరస్ బారిన పడుతున్న వారిలో ఇతర దేశాల నుంచి వస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. శుక్రవారం ఒక్కరోజే 33 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్లలో ఒక్కోటి, ఇతర రాష్ట్రాల్లో 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఉదయం వరకు 197గా ఉన్న బాధితుల సంఖ్య ప్రస్తుతం 209కి చేరింది. శుక్రవారం యూకే నుంచి ఇండియాకు తిరిగొచ్చిన 69 ఏళ్ల పంజాబ్ మహిళకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు.
Latest News