by సూర్య | Fri, Mar 20, 2020, 07:12 PM
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపుగా 171 పైగా దేశాల్లో విస్తరించిన మహమ్మారి 10,000 మందికి పైగా ప్రాణాల్ని బలి తీసుకుంది. భారత్లో మొదట అంతగా ప్రభావం చూపని ఈ మహమ్మారి క్రమక్రమంగా కోరలు చాస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తన అఫీషియల్ వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.భారత్ లోని ఎయిర్ పోర్టుల్లో ఇప్పటివరకు 14,59,993 మందికి కరోనా పరీక్షలు
కరోనా పాజిటివ్ గా నమోదైన కేసులు: 223
రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం - పాజిటివ్ కేసుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ - 3
ఛత్తీస్ గఢ్- 1
ఢిల్లీ- 17
గుజరాత్- 5
హర్యానా- 17
కర్ణాటక - 15
కేరళ - 28
మహారాష్ట్ర - 52
ఒడిషా - 2
పంజాబ్ - 2
పాండిచ్చేరి- 1
రాజస్థాన్ - 17
తమిళనాడు- 3
తెలంగాణ - 17
చండీగఢ్- 1
జమ్మూ& కాశ్మీర్- 4
లడఖ్- 10
ఉత్తరప్రదేశ్ -23
ఉత్తరాఖండ్ - 3
పశ్చిమ్ బంగా- 2
మొత్తం కేసులు(భారతీయులు, విదేశీయులు) - 223
కాగా ఈ మహమ్మారితో పోరాడి ఇప్పటివరకు 23 మంది జయించారు.
రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం డిశ్చార్జి అయినవారి సంఖ్య
ఢిల్లీ - 5
కర్ణాటక- 1
కేరళ - 3
రాజస్థాన్ - 3
తమిళనాడు- 1
తెలంగాణ - 1
ఉత్తరప్రదేశ్ - 9
ఈ మహమ్మారి ఇప్పటివరకు నలుగురి ప్రాణాలను బలిగొంది.
రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం సంభవించిన మరణాలు
కర్ణాటక - 1
ఢిల్లీ - 1
మహారాష్ట్ర- 1
పంజాబ్ - 1
కరోనాను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలను ముమ్మరం చేశాయి. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి.
Latest News