by సూర్య | Fri, Mar 20, 2020, 07:03 PM
ఆయన ఓ మామూలు రైతు. కానీ ఓ యువతికి ఉద్యోగమిప్పిస్తానని ఆశచూపి అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా చాలా మందినే మోసం చేశాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దవలూరుకు చెందిన రవిశేఖర్ కు 48 సంవత్సరాలు. అతను ఓ మామూలు రైతు. అయితే ఏదో రకంగా ఏజెన్సీ ఉద్యోగాల గురించి తెలుసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగమిప్పిస్తానని పలువురిని మోసం చేసే దందా ప్రారంభించాడు. ఉద్యోగమిప్పాస్తానని చాలా మందిని నమ్మించి డబ్బు వసూలు చేశాడు. చాలామందిని మోసం చేశాడు. వీటికి సంబంధించి అతని పై ఏపీ,తెలంగాణ,కర్ణాటకలో దాదాపు 40 కేసులు ఉన్నాయి.2019 జూలై 23న ఓ 21 ఏళ్ల యువతికి ఉద్యోగమిప్పిస్తానని నమ్మించి తన కారులో యువతిని తీసుకెళ్లాడు. యువతిని కారులో కడప,కర్నూలు,గుంటూరులో తిప్పాడు. అలా తిప్పుతూ యువతి పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. రవిశంకర్ నుంచి ఎలాగో అలా తప్పించుకున్న యువతి అనంతరం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు 2019 ఆగష్టు3న పంతంగి టోల్ గేట్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అనంతరం అతనిని రిమాండ్ కు తరలించారు. రవిశంకర్ కు జీవిత ఖైదుతో పాటు రూ.90వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ఒకటవ ప్రత్యేక మహిళా సెషన్స్ కోర్టు గురువారం తీర్పునిచ్చింది.
Latest News