by సూర్య | Thu, Mar 19, 2020, 02:20 PM
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా బహిరంగ స్థలాల్లో పారిశుధ్ధ్యం మెరుగునకు సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబై నగరంలో ఇక బహిరంగంగా ఉమ్మి వేస్తే వెయ్యిరూపాయల చొప్పున జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ముంబై నగరంలో బహిరంగంగా ఉమ్మి వేసిన 107 మంది నుంచి రూ.1.07లక్షల జరిమానాను వసూలు చేశామని బీఎంసీ అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా గురువారం బీఎంసీ అధికారి బహిరంగంగా ఉమ్మి వేసిన వారికి వెయ్యిరూపాయల జరిమానా విధిస్తామని లేదా ఐపీసీ సెక్షన్ 189 ప్రకారం అరెస్టు చేస్తామనిహెచ్చరించారు.
Latest News