సీఎం జగన్ పై మండిపడ్డ బీజేపీ ఎంపీ

by సూర్య | Thu, Mar 19, 2020, 01:22 PM

ఏపీ ‌సీఎం జగన్‌పై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తి బాధ్యతారహితంగా మాట్లాడారని అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ పై ఇష్టానుసారం మాట్లాడారని మండిపడ్డారు. ఈ మేరకు సీఎం స్థాయి వ్యక్తి కులం గురించి మాట్లాడడం బాధాకరమని సుజనా చౌదరి అన్నారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల అధికారిపై హైకోర్టు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు వచ్చారని సుజనాచౌదరి మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం కన్నా ఎన్నికలే ముఖ్యం అనేలా ప్రభుత్వ తీరు ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల అధికారికి కులాన్ని అంటకట్టడం మంచిది కాదని సూచించారు.
అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కూడా కులం ఆపాదించేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ నాయకులపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోండా ఉమ, బుద్దా వెంకన్నపై దాడి హత్యాయత్నమేనని సుజనా ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధులను కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని సుజనాచౌదరి విమర్శించారు. ఏకగ్రీవం అయిన చోట్ల మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కన్నాపై వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని హితవు పలికారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM