by సూర్య | Thu, Mar 19, 2020, 12:41 PM
గురువారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్, 10వ తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని వెల్లడించారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఈ నెల 31 వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఏపీలోని అన్ని పాఠశాలలు, కళాశాలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లకు సెలవులు ప్రకటించామన్నారు. కాగా విద్యాశాఖ పరిధిలోకి వచ్చే ప్రైవేటు యూనివర్శిటీలు, డిమ్డ్ యునివర్శిటీలతో పాటు కోచింగ్ సెంటర్లు ప్రభుత్వ ఉత్తర్వులను పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Latest News