by సూర్య | Thu, Mar 19, 2020, 12:12 PM
ఏడాదికి రూ.5 కోట్ల కంటే ఎక్కువగా వ్యాపార లావదేవీలు నిర్వహించే కంపెనీలు జీఎస్టీ తప్పనిసరిగా ఫైల్ చేయాలని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ లిమిట్ రూ.2కోట్లు ఉండేది. అలాగే డెడ్ లైన్ కూడా మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడిగించింది. ప్రస్తుతం దేశంలో ఆర్థిక మందగమనం ఉన్న నేపథ్యంలో ఎరువులు, ఫుట్ వేర్ మీద జీఎస్టీ పెంచకూడదని నిర్ణయించింది. టెక్స్టైల్స్ మీద జీఎస్టీ తగ్గింపు మీద నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం జీఎస్టీ ఫైల్ చేయడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిచేందుకు నందన్ నీలేకని ఓ రోడ్ మ్యాప్ ప్రజెంటేషన్ను ఇచ్చినట్టు తెలిసింది. అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటే, 2021 నాటికి అన్ని సమస్యలు సర్దుకుంటాయని, అవాంతరాలకు పరిష్కారం లభిస్తుందని నందన్ నీలేకని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల మీద కూడా జీఎస్టీ కౌన్సిల్ చర్చించింది.
Latest News