by సూర్య | Sun, Feb 16, 2020, 05:26 PM
తాడేపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపి మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడారు. చిన్న ఉద్యోగి వద్దే రూ.2 వేల కోట్లు ఉంటే రాష్ట్రాన్ని చంద్రబాబు ఏవిధంగా పరిపాలించాడో అర్థం చేసుకోవచ్చన్నారు. గత ఐదేళ్లలో ఏపీలో జరిగిన అక్రమాలపై దేశమంతా కోడై కూసిందని.. ఇవాళ ఆ బండారం అంతా బయటపడిందని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. బయటపడిన అక్రమాలు చాలా తక్కువని ముఖ్యమైన వారిపై దాడులు జరిగితే లక్షల కోట్లు అక్రమాలు బయటకు వస్తాయన్నారు. ఓటుకు నోటు కేసు కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. వికేంద్రీకరణ బిల్లులపై ఆర్డినెన్స్ ఇవ్వాలా..? గవర్నర్ ఆమోదానికి పంపాలా..? అనేది ఆలోచన చేస్తామని ఉమ్మారెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్కు పంపలేదని చెప్పారు.వికేంద్రీకరణ బిల్లుల విషయంలో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభన ఇంకొన్ని రోజులు కొనసాగుతుందని చెప్పారు.
Latest News