వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by సూర్య | Sun, Feb 16, 2020, 01:49 PM

వైసీపీ చేసిన తప్పుడు ప్రచారంపై సమాధానం చెప్పాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. ఇవాళ మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. వైసీపీ మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉన్నా ప్రజాసేవ చేయలేని దద్దమ్మలు వైసీపీ మంత్రులు అని ఆయన వ్యాఖ్యానించారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం వైసీపీ నేతలకు అలవాటైందని విమర్శలు గుప్పించారు.
తన ఆస్తులను బహిరంగంగా ప్రకటించే ధైర్యం సీఎం వైఎస్ జగన్‌కు ఉందా? అని ఒకింత సవాల్ విసిరారు. క్రిమినల్‌ కేసుల్లో వైసీపీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిందని విమర్శలు గుప్పించారు. జగన్‌ బినామీ కంపెనీ మెగా కన్‌స్ట్రక్షన్స్‌పై నిర్వహించిన ఐటీ దాడుల్లో బయటపడ్డ సొమ్మును వెల్లడించాలని ఈ సందర్భంగా రామానాయుడు డిమాండ్ చేశారు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM