మూడు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

by సూర్య | Sun, Feb 16, 2020, 08:47 AM

ఢిల్లీ ఓటమి తర్వాత బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. సిక్కిం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త చీఫ్‌లను నియమించింది. ఢిల్లీ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడింది. 70 స్థానాలున్న అసెంబ్లీలో కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, జబల్‌పూర్ ఎంపీ రాకేశ్ సింగ్ స్థానంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఖజురహో ఎంపీ విష్ణుదత్ శర్మను నియమించగా, సిక్కిం బీజేపీ చీఫ్‌గా దల్ బహదూర్ చౌహాన్‌ను నియమించింది. కేరళ అధ్యక్షుడిగా కె.సురేంద్రన్‌లను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.

Latest News

 
వైసీపీ నుండి టీడీపీలోకి 50 కుటుంబాలు చేరిక Tue, Apr 23, 2024, 11:44 AM
ఉపాధి హామీ కూలీలకు ఓటింగ్ పై అవగాహన: నోడల్ ఆఫీసర్ Tue, Apr 23, 2024, 11:43 AM
ఘనంగా సీతారాముల కళ్యాణం Tue, Apr 23, 2024, 11:40 AM
కర్ణాటక మద్యం పట్టివేత Tue, Apr 23, 2024, 11:38 AM
ఏనుగు బొమ్మతో వచ్చి నామినేషన్ దాఖలు చేసిన బీఎస్పీ Tue, Apr 23, 2024, 11:34 AM