by సూర్య | Sat, Feb 15, 2020, 04:36 PM
విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి వస్తుందా? ఎన్డీయేలోకి వైసీపీ చేరబోతుందా? సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తరవాత ఇలాంటి ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. తాజాగా మరో ప్రచారం తెరపైకి వచ్చింది. వైసీపీకి రెండు లేదా మూడు పదవులు దక్కబోతున్నాయనేదే ఆ వార్త. వైసీపీకి ఒక కేంద్ర మంత్రి, ఒక సహాయ మంత్రి పదవి దక్కనున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీలో నేత అయిన విజయసాయిరెడ్డికి నౌకాయానశాఖను అప్పగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అనురాధకు కేంద్ర సహాయ మంత్రి ఇవ్వచ్చనే చర్చ జరుగుతోంది.
Latest News