by సూర్య | Sat, Feb 15, 2020, 04:21 PM
గత మూడు రోజులుగా ప్రధాని మోడీ సహ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం జగన్ సమావేశం అవుతున్నారు. ఎన్డీఏలోకి వైసీపీ వెళ్లడం ఖాయమని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ఇంచార్జీ, జాతీయ కార్యదర్శి సునీల్ దేవదర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తాము వైసీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చేశారు. జనసేనతో మాత్రమే తమ పొత్తు కొనసాగుతుందని సునీల్ దేవదర్ స్పష్టం చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామని.. జనసేనతో కలిసి వైసీపీ విధానాలపై పోరాటం చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
Latest News