by సూర్య | Sat, Feb 15, 2020, 02:28 PM
ప్రకాశం జిల్లా కొండెపిలో ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంను ధ్వంసం చేసి నగదు దొంగిలించడానికి విఫలయత్నం చేశారు దొంగలు. కొండెపిలోని టంగుటూరు రోడ్ లో ఉన్న ఈ ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో శుక్రవారం సిబ్బంది 22లక్షల నగదు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న దొంగలు.. రాత్రి నుంచి రెక్కీ నిర్వహించారు. తెల్లవారుఝామున ఎవరూ లేని టైమ్ చూసుకుని ఏటీఎం మిషన్ పగలగొట్టారు. మిషన్ ధ్వంసమైంది కానీ డబ్బులున్న ర్యాక్ తెరుచుకోలేదు. దీంతో దొంగలు పరారయ్యారు. తెల్లవారిన తర్వాత బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన్ స్థలానికి వచ్చి సీసీ టీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు
Latest News