by సూర్య | Sat, Feb 15, 2020, 09:11 AM
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 3 గంటలు, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 65,226 మంది భక్తులు దర్శించుకోగా, 22,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.15 కోట్లు.
Latest News