by సూర్య | Fri, Feb 14, 2020, 03:48 PM
శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని సోదా చేశామని ఐటీ శాఖ ప్రకటించిందని బొత్స సత్యనారాయణ అన్నారు. మొత్తం 40 చోట్ల సోదాలు చేసినట్లు ఐటీ శాఖ ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే ప్రైవేట్ సెక్రటరీ మీద ఐటీ దాడులు జరిగాయి. రాష్ట్రానికే కాదు ప్రపంచానికి తెలిసి పోయింది. చంద్రబాబు, లోకేశ్ ఇళ్లపై కూడా ఐటీ సోదాలు చేయాలని అన్నారు. అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారు. ఐటీ దాడులతో చంద్రబాబు అవినీతి తేటతెల్లమైంది. రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి కానీ అవినీతి కాదు అన్నారు.
Latest News