రథానికి నిప్పు పెట్టిన ఘటనపై మంత్రి వెల్లంపల్లి సీరియస్

by సూర్య | Fri, Feb 14, 2020, 02:35 PM

రథానికి నిప్పు పెట్టిన ఘటనపై మంత్రి వెల్లంపల్లి సీరియస్ః విచారణకు ఆదేశం. భక్తులెవరూ ఆందోళన చెందవద్దు.నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిగ్రుంటలో దుండగులు ఆలయ రథానికి నిప్పు పెట్టిన ఘటనపై దేవదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు.  విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీతో  ఫోన్లో మాట్లాడారు. దుండగులెవరో తక్షణం గుర్తించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.  ఘటనపై తక్షణ చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణిని ఆదేశించారు.  అలానే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.  ఆకతాయిలు, దుండగులు చేస్తున్న ఇటువంటి చర్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాల పరిరక్షణకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు


 


 

Latest News

 
అత్యధిక మెజార్టీతో డాక్టర్ రాజేష్ ను గెలిపించుకుంటాం Wed, Apr 24, 2024, 11:38 AM
4.5 కేజీల బాల భీముడు పుట్టాడు! Wed, Apr 24, 2024, 11:09 AM
కాలజ్ఞాన సన్నిధిలో సినీ నటుడు సుమన్ Wed, Apr 24, 2024, 11:09 AM
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ Wed, Apr 24, 2024, 10:40 AM
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM