by సూర్య | Wed, Feb 12, 2020, 07:12 PM
వివాహమైన యువతి ప్రియుడితో జంప్ అయ్యింది. ఆ తర్వాత పుట్టింటికి వచ్చింది. పుట్టింటికి ప్రియుడు కూడా రావడంతో ఆగ్రహించిన తండ్రి పరువుపోయిందన్న ఆగ్రహంతో కూతురిని హత్య చేశాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్నాటకలోని బళ్లారి తాలుకా గోడేహళ్ గ్రామానికి చెందిన గోపాలరెడ్డికి కవిత అనే కుమార్తె ఉంది. ఆమెకు ప్రస్తుతం 22 సంవత్సరాలు. కవితకు నాలుగు సంవత్సరాల క్రితం సండూరు తాలుకా కురెకుప్ప గ్రామానికి చెందిన యువకునితో వివాహమైంది. వీరి కాపురం సజావుగానే సాగింది. అదే గ్రామానికి చెందిన ప్రకాశ్ అనే యువకుడు పని నిమిత్తం కవిత ఇంటికి వచ్చేవాడు. అలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో రెండు నెలల క్రితం కవిత ప్రియుడు ప్రకాశ్ తో కలిసి ఎటో వెళ్లిపోయింది.
మూడు రోజుల క్రితం కవిత పుట్టింటికి వచ్చింది. తండ్రి గోపాల్ రెడ్డి గొడవ పెట్టుకున్నాడు. ఇంతలోనే ప్రియుడు ప్రకాష్ సోమవారం రాత్రి వచ్చి తనతో రావాలంటూ కవితతో గొడవకు దిగాడు. దీన్ని చూసిన గోపాల్ రెడ్డి పరువు పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆవేశంతో కవిత పై దాడి చేశాడు. దీంతో కవిత మృతి చెందింది. కవితను గోపాల్ రెడ్డే హత్య చేశాడనడానికి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.