సీబీఐ చేతిలో అయేషా మీరా రీపోస్టుమార్టం రిపోర్టు

by సూర్య | Wed, Feb 12, 2020, 06:57 PM

విజయవాడలో దారుణ హత్యకు గురైన అయేషా మీరా హత్య కేసును సీబీఐ దర్యాప్తు విషయం తెలిసిందే. అయేషా రీ పోస్టుమార్టంకు సంబంధించిన సీఎస్ఎఫ్ఎల్ రిపోర్టు సీబీఐ చేతికి అందింది. ఈ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోయింది అమ్మాయి అని డీఎన్ఏ రిపోర్టులో తేలింది. ఆమె వయస్సు 19 సంవత్సరాలని నివేదిక తేల్చింది. తల భాగంలో ఉన్న బోన్ ఫ్యాక్చర్ అయినట్టు ఫోరెన్సిన్ నివేదికలో వచ్చింది. బోన్ లో ఉన్న షార్ప్ ఏడ్జ్ లో బలంగా గాయం అయినట్టు నివేదికలో తేలింది.
27 డిసెంబర్ 27న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్ లో ఉంటూ, నిమ్రా కాలేజీలో ఫార్మసీ కోర్సు చేస్తున్న 19 ఏళ్ళ ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. అయేషా మీరాను అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ముగ్గురు నిందితులను ఈ కేసులో అరెస్టు చేసినా వారి పై నేరాన్ని రుజువు చేయలేకపోయారు. చివరకు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆయేషా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని తేలాడు కానీ... అసలు దోషులెవరో బయటపడలేదు.

Latest News

 
వైసీపీని రాష్ట్రము నుండి తరిమికొట్టాలి Sat, Apr 20, 2024, 01:42 PM
చంద్రబాబు తరుపున పేదలకు అన్నదానం చేయనున్న భువనేశ్వరి Sat, Apr 20, 2024, 01:42 PM
జగనుకు చిత్తశుద్ధి ఉంటే తనపై జరిగిన రాయి దాడిపై సీబీఐ విచారణ కోరాలి Sat, Apr 20, 2024, 01:41 PM
ట్విటర్ వేదికగా చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు Sat, Apr 20, 2024, 01:40 PM
రూ.18 వేల కోట్లకు చేరిన టీటీడీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు Sat, Apr 20, 2024, 01:40 PM