by సూర్య | Wed, Feb 12, 2020, 06:37 PM
టీడీపీ ముఖ్యనేతలకు కక్ష్యపూరితంగా గన్మెన్లను తొలగించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తుల నుంచి తమకు ముప్పు ఉందని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారని, మంత్రులే బహిరంగంగా బెదిరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ చిన్నాన్న వివేకాకే దిక్కులేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో తమ వల్ల ఇబ్బందులు పడ్డ సంఘ వ్యతిరేక శక్తుల నుంచి ముప్పు ఉందన్నారు. ప్రభుత్వ చర్యలకు భయపడేది లేదని దేవినేని ఉమ స్పష్టం చేశారు.
Latest News