by సూర్య | Wed, Feb 12, 2020, 05:46 PM
చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్రల పేరుతో బస్సు యాత్ర నిర్వహించాలనుకోవడం హాస్యాస్పదం అని అన్నారు ఏపీఐఐసీ చైర్మన్ రోజ. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే ఆయన్ను ఓడించి మూల కూర్చోబెట్టారని చెప్పారు. ప్రజల చైతన్యానికి వచ్చిన ప్రమాదమేమే లేదని, రాష్ట్రం సుభిక్షంగా ఉందని, అమ్మఒడి, రైతు భరోసా, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, దిశ వంటి పథకాలు.. వర్షాలు వచ్చి రైతులంతా సుఖంగా ఉన్నారని చెప్పారు. ఈ దశలో చంద్రబాబు తన పాదం మోపి రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని హితవు పలికారు. చంద్రబాబు పాదం మోపితే పచ్చని చెట్లు కూడా ఎండిపోతాయని, ఆయన పాదం మోపలేదు కాబట్టే ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా గెలిచారని ఎద్దేవా చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై ధ్వజమెత్తారు రోజా.
Latest News