by సూర్య | Tue, Feb 11, 2020, 08:06 PM
రాజస్థాన్ లోని జైపూర్ లో దారుణం జరిగింది. అమ్మాయితో టిక్ టాక్ చేశాడని బాలుడిని కొట్టుకుంటూ నగ్నంగా రోడ్డు పై తిప్పారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జైపూర్ బస్తీకి చెందిన ఓ బాలుడు 14 ఏళ్ల బాలికతో కలిసి టిక్ టాక్ వీడియో తీశాడు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోను బాలిక అన్న చూసి బాలుడిని కొట్టాడు. శుక్రవారం రోజు ఈ విషయం బాలిక తండ్రికి తెలియడంతో అతను బాలుడిని పట్టుకొని చితకబాదాడు. రోడ్డు పైనే బట్టలిప్పి కొట్టుకుంటూ తీసుకెళ్లాడు. దీనిని కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ గా మారింది. ఈ విషయం బాలుడి తండ్రికి తెలియడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక తండ్రి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇరువురిని పోలీసులు అరెస్టు చేశారు.
Latest News