by సూర్య | Tue, Feb 11, 2020, 05:56 PM
సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కన్నుమూశారనే వార్త తనను బాధకు గురి చేసిందని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. వ్యక్తిగతంగా వారితో తన చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని తెలిపారు. వామపక్ష భావాలు కలిగిన రామారావు మృదు స్వభావని చెప్పారు. తెలుగు సినిమాపై పలు రచనలు చేసి సినీ చరిత్రకు అక్షర రూపమీయడంలో తమవంతు పాత్రను పోషించారన్నారు.
Latest News