by సూర్య | Tue, Feb 11, 2020, 01:56 PM
ఢిల్లీ పీఠం పై ఆప్ మరోసారి జెండా రెపరెపలాడించింది. 70 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఆప్ 50 స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకుంది. మరికొన్ని స్థానాల్లో ముందంజలో ఉంది. ఆప్ దూకుడుతో బీజేపి కొన్ని స్థానాలకే పరిమితమైంది. ఆరు జిల్లాల్లో ఆప్ ఏకపక్షంగా దూసుకుపోతుంది. ఆప్ విజయం ఖాయం కావడంతో సీఎం కేజ్రివాల్ ఆప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడికి ప్రజలు భారీ సంఖ్యలో చేరుకొని సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకుంటున్నారు. 2015 ఎన్నికలతో పోల్చితే బీజేపీ కాస్త పుంజుకుంది. కాంగ్రెస్ మాత్రం కంటికి కనిపించకుండా పోయింది.
Latest News