by సూర్య | Tue, Feb 11, 2020, 01:40 PM
ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు భద్రత తొలగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్క ఆనంద్ బాబు, జెసి దివాకర్ రెడ్డి, పల్లె రఘనాథరెడ్డి, కాల్వ శ్రీనివాసులుకు సర్కార్ భద్రతను తొలగించింది. అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు లకు కూడా భద్రతను తొలగించారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖులందరికి భద్రత తొలగింపు అనేది ప్రభుత్వం కక్ష్యపూరితంగా చేస్తున్న వ్యవహారమని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.
Latest News