by సూర్య | Mon, Feb 10, 2020, 06:33 PM
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడంపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దగ్గర పనిచేసిన వాళ్లు అవినీతి చేసినా తాము చూస్తూ కూర్చోవాలా? అని ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఐటీ దాడులపై ఎందుకు మాట్లాడటం లేదని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో భయపడి దొంగలా పారిపోయి ఇక్కడికి వచ్చారని చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వ్యాపారస్తులతో కలిసి నారాయణ కమిటీ వేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి బొత్స పేర్కొన్నారు.
Latest News