by సూర్య | Fri, Jan 17, 2020, 07:22 PM
వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్ కి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బినామీ అని ఆరోపించారు. సాక్షి కార్యాలయాలు ద్వారంపూడి పేరు మీద ఉన్నాయని తెలిపారు. కాకినాడలో ద్వారంపూడి కుటుంబ దందాలకు అంతేలేదని, ద్వారంపూడి తండ్రి అనపర్తిలో దొంగనోట్లు ముద్రించి చెలామణీ చేసేవాడని ఆరోపించారు. ‘రేషన్ బియ్యాన్ని అక్రమంగా షిప్పుల్లో విదేశాలకు తరలించిన చరిత్ర మీది’ అని పంచుమర్తి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. పేకాట క్లబ్ లో గతంలో ఓ మంత్రిని గన్ తో ద్వారంపూడి బెదిరించారని తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషి చంద్రబాబు అని ఆమె చెప్పుకొచ్చారు. చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి ద్వారంపూడికి లేదన్నారు. ద్వారంపూడి నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. హైపవర్ కమిటీ మీటింగ్ పేరుతో కోర్టుకు వెళ్లకుండా జగన్ డ్రామాలాడుతున్నారని పంచుమర్తి ఆరోపించారు.
Latest News