by సూర్య | Fri, Jan 17, 2020, 07:04 PM
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఆసక్తికర పరిణామాలు ఎదురవుతున్నాయి. రైతుల అభిప్రాయాలు తీసుకునేందుకు హైకోర్టు గడువు పొడగించింది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు గడువు పొడగించింది. సోమవారమే కేబినెట్, అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇప్పుడు ఆ కేబినెట్ సమావేశాన్ని అనూహ్యంగా ప్రభుత్వం రేపటికి మార్చేసింది. రేపు హైపవర్ కమిటీ నివేదిక సమర్పిస్తుందా.. లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశం జరగనుంది.
Latest News