by సూర్య | Fri, Jan 17, 2020, 05:46 PM
ఏపీ సీఎం జగన్ కు సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసుకు సంబంధించిన 5 ఛార్జీషీట్లను కలిపి ఒకేసారి విచారించాలని జగన్ కోర్టును అభ్యర్ధిస్తూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసింది. ఈడీ విచారణ నిలిపివేయాలన్న మరో పిటిషన్ ను కూడా కోర్టు తిరస్కరించింది. కేసులన్ని వేర్వేరుగానే విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. దీంతో సీఎం జగన్ కు కోర్టులో చుక్కెదురైంది.
Latest News