రాష్ట్రంలో అమరావతి ఓ భాగమే: బొత్స

by సూర్య | Fri, Jan 17, 2020, 04:34 PM

రాష్ట్రంలో అమరావతి ఓ భాగం మాత్రమేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రెండ్రోజుల్లో సీఎం జగన్ కు హైపవర్ కమిటీ నివేదికను అందజేస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తో హైపవర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. హైపవర్ కమిటీ సమావేశాల వివరాలు సీఎం జగన్ కు వివరించామన్నారు. సీఆర్డీఏ రద్దు గురించి మీడియాకు ఎవరు చెప్పారో అని..? తనకు మాత్రం తెలియదని బొత్స ఎదురు ప్రశ్నించారు. సచివాలయం శాశ్వతమని చంద్రబాబు చెప్పారని నిరూపిస్తే తలదించుకుని వెళ్లిపోతానని బొత్స సత్యనారాయణ తెలిపారు.


అమరావతిలో ఉన్న తాత్కలిక భవనాలను ప్రత్య్మామయ అవసరాలకు ఉపయోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. జనసేనకు ఇప్పటికి జ్ణానోదయం అయిందని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధానిగా ఏర్పాటు చేస్తున్నామని శాసనసభలో ప్రకటన మాత్రమే చేసారని.. అఖిలపక్ష సమావేశం గతంలో ఏర్పాటు చేయలేదని బొత్స అన్నారు. రాజధాని రైతుల పట్ల తమకు సానుభూతి ఉందని.. వారు చంద్రబాబు మాయలో పడొద్దని మంత్రి బోత్స సూచించారు.

Latest News

 
ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరికొన్ని రైళ్లు పొడిగింపు, పూర్తి వివరాలివే Fri, Mar 29, 2024, 08:11 PM
ఎవరితో ఎవరు.. ఏపీ ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల పూర్తి జాబితా Fri, Mar 29, 2024, 08:08 PM
చిన్నాన్న అంటే అర్థం తెలుసా.. నీ పేరు బయటకొస్తుందని భయపడ్డావా: వైఎస్ సునీత Fri, Mar 29, 2024, 08:06 PM
విశాఖ తీరంలో అరుదైన చేప.. చూడటానికి అచ్చం మనిషిలాగే Fri, Mar 29, 2024, 08:05 PM
షాలీమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి.. 5 గంటలకుపైగా నరకం Fri, Mar 29, 2024, 07:57 PM