by సూర్య | Fri, Jan 17, 2020, 03:18 PM
ఈ రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో చాలా జిల్లాల విభజన చేశామని, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాక కొంచం కూడా వ్యతిరేకత రాలేదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై మాత్రం ఆందోళనలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. చాలా వ్యతిరేకత వస్తోందని, ఎందుకనేది ఆలోచించుకోవాల్సి ఉందని చెప్పారు. బీజేపీతో జనసేన పొత్తుపై మీడియా ప్రశ్నించగా. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏం చేస్తే మాకేంటీ? అని ప్రశ్నించారు. ఆ విషయాలన్నింటినీ ఏపీ ప్రజలు చూసుకుంటారని వ్యాఖ్యానించారు.
Latest News