by సూర్య | Fri, Jan 17, 2020, 11:51 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను విశాఖలో నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి గవర్నర్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తూ అధికారులకు తగిన సూచనలిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో కమిటీలను నియమించారు. అతిథుదలకు అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 1500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేశారు.
Latest News