by సూర్య | Fri, Jan 17, 2020, 11:36 AM
తిరుమల :తిరుమల శ్రీవారిని హీరో మహేష్బాబు దంపతులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం మహేష్ బాబు దంపతులతో పాటు విజయ శాంతి, రాజేంద్రప్రసాద్, దర్శకుడు అనిల్, వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్, నిర్మాత ఎన్వీ ప్రసాద్, దిల్ రాజు, సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ సభ్యులో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో హీరో మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై హిట్ టాక్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే..
Latest News