by సూర్య | Thu, Jan 16, 2020, 05:34 PM
కడప విమానాశ్రయం లో ట్రూజెట్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది.. కడప నుండి విజయవాడకు ప్రయాణికులతో వెళుతున్న విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎదురుగా పక్షి అడ్డు తగలడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు.. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా విమానాన్ని కిందకు దించారు.. విమానంలో ప్రయాణికుల తో పాటు వైసిపి రాష్ట్ర సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు…పక్షి దెబ్బకు ఇంజన్ దెబ్బ తినడంతో ఆ విమానాన్ని రద్దు చేశారు.. ప్రయాణీకులను పత్యామ్నాయ మార్గాల ద్వారా హైదరాబాద్ కు తరలించారు..
Latest News