by సూర్య | Thu, Jan 16, 2020, 02:09 PM
జగన్ అమలు చేస్తున్న పథకాల వల్ల టిడిపి వర్గాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. ప్రజా సంక్షేమ పథకాల వైపు జగన్ దూసుకెళ్తుండటంతో టిడిపి నాయకులు తమదైన శైలిలో నిరసన జ్వాలలు రగిలించారు. అయితే ఆ కార్యక్రమాలు కూడా టిడిపి నాయకులకు అంతగా అనుకూలించలేదు. పార్టీలో చంద్రబాబు వారసుడిగా తెరపైకి వచ్చిన లోకేశ్.. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన సామర్థ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఎంతైనా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తారక్ను రంగంలోకి దించాలని టీడీపీ కార్యకర్తలు ఎప్పటినుండో కోరుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సంక్రాంతి సందర్భంగా టీడీపీ నేతలు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి బూదాల అజితారావుకు శుభాకాంక్షలు చెబుతూనే, 2024లో ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ.. ఆయన ఫోటోను కూడా ముద్రించారు. ఆ ఫ్లెక్సీని పార్టీ కార్యకర్తలే ఏర్పాటు చేశారు. అయితే.. ఆ ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు.. సచివాలయంలో సీఎం చైర్లో ఎన్టీఆర్ కూర్చున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటో కూడా తెగ వైరల్ అవుతోంది. మరి దీనిపై ఎన్టీఆర్ ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. ఒక వేళ ఎన్టీఆర్ స్పందించకపోతే 2024 లో కచ్చితంగా సిఎంగా ఎన్టీఆర్ పోటీ చేసే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
Latest News