by సూర్య | Thu, Jan 16, 2020, 01:07 PM
పవన్ కళ్యాణ్ పై సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బీజేపీతో ఎందుకు కలుస్తున్నారో పవన్ చెప్పాలి అన్నారు. హోదా ఇవ్వకుండా బీజేపీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని పవన్ అన్నారు. ఢిల్లీలో నడ్డాను కలిశాక పవన్ కు బందరు లడ్డూలు ఇచ్చారా అని అన్నారు. ఢిల్లీ వెళ్లిన నేతలు జేఎన్ యూకు వెళ్తే పవన్ బీజేపీ ఆఫీస్ కు వెళ్లారు. చేగువేరా ఆదర్శమన్న పవన్ చెంగు వీర అయ్యారు. దమ్మున్నవాడే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. పవన్ కు దమ్ముందో, లేదో సమాధానం చెప్పాలి అన్నారు.
Latest News