by సూర్య | Thu, Jan 16, 2020, 10:51 AM
ప.గో. జిల్లా వ్యాప్తంగా జోరుగా కోడి పందాలు జరుగుతున్నాయి. మూడోరోజు కోడిపందాలకు భారీగా పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు. బరులు దగ్గర, పేకాట దగ్గర, గుండాట దగ్గర, సందడి వాతావరణం నెలకొన్నది. కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పలు బరులపై పోలీసులు దాడులు చేశారు. పెదవేగి మండలం కవ్వగుంటలో పందెంరాయుళ్ల పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రగడవరంలో కోడికత్తి తగిలి వ్యక్తి మృతి చెందారు.
Latest News